VSP: ఏప్రిల్ 25న బీచ్ రోడ్డులో జరగనున్న శ్రీ హనుమాన్ శోభాయాత్ర గోడపత్రికను కూటమి నేతలు పల్లా శ్రీనివాసరావు, పరశురామరాజు, కరణంరెడ్డి వరసింగరావు ఇవాళ ఆవిష్కరించారు. గాజువాక వంటిల్లు నుంచి మధ్యాహ్నం 2.30కు ర్యాలీ ప్రారంభమై బీచ్ రోడ్ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అక్కడి నుంచి పల్లకిలో శోభాయాత్ర కాళీమాత ఆలయం వరకు జరుగుతుందని చెప్పారు.