సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని రహదారి అయినా జనగాం హుస్నాబాద్ రోడ్డులో ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద సూచికల బోర్డు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.