AP: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అంచనాలు తయారు చేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరట లభించనుందని చెప్పారు. 46,113 మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.