PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రకు బయలుదేరగా జెండా ఊపి సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ ప్రారంభించారు.