సత్యసాయి: కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉంటామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. కదిరిలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆయనను కలిసి, బ్రాండెడ్ సెలూన్ల పోటీతో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. ఆధునికత పేరుతో చిన్న వ్యాపారులు నష్టపోవడం సరికాదని ఆయన అన్నారు.