AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,084 మంది భక్తులు దర్శించుకోగా.. 28,929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.