అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని MPUP ఉర్దూ స్కూల్ విద్యార్థుల తాగునీటి సమస్యకు సోమవారం శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి 3,4వ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, దాపేదర్పల్లి MPP స్కూల్లో రూ.5 లక్షలతో కొత్త బోరు, మోటార్ ఏర్పాటు చేయించి నీటి సమస్యను తీర్చారు. మంత్రి స్కూల్కు స్థలం, ఆర్వో ప్లాంట్, కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.