గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో శనివారం రాత్రి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ వేధింపులకు ఏ మాత్రం వెనుకాడబోమని, ప్రజల తరఫున పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.