ADB: విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. సర్. సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక కృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు.