ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ కాలేయ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కెరీర్లో ‘ఆంఖేన్’, ‘అందాజ్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2015-2017 మధ్య సెన్సార్ బోర్డు ఛైర్మన్గా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.