లక్నోతో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. కేవలం 3 ఓవర్లలోనే ఏకంగా 17.30 ఎకానమీతో 52 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో PBKS తరఫున అత్యధిక(7) సార్లు 50+ రన్స్ ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో సామ్ కరన్(4), రబాడ, షమీ, బార్ట్లెట్(3) ఉన్నారు.