ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారాయణ, మండల ఛైర్మెన్ రుద్రరాజు యువరాజు, కో ఛైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావులు పాల్గొని పుష్పంజలి ఘటించారు.