AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో లడ్డూపై లఘు చర్చలో గందరగోళం ఏర్పడింది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ స్టేట్మెంట్కు సిద్ధమయ్యారు. దీనిపై ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. లఘుచర్చలో ప్రతిపక్షానికి మొదట అవకాశమని ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ స్టేట్మెంట్ తర్వాతే చర్చించాలని మంత్రి అన్నారు.. ఈ గందరగోళంతో మండలి వాయిదా పడింది.