కృష్ణా: ఉంగుటూరు మండలం ఇందుపల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చిన్నారులపై నేరాలకు పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని ఎస్సై గోవింద్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు.