KDP: గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. నిందితులను గుర్తించి కౌన్సిలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.