W.G: జిల్లాలో వరి కోతల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వర్షాల ముప్పు ఉన్నందున రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 50% గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు.