భారతదేశంలోని 36 ప్రధాన నగరాల్లో ఈ ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నిర్మలమైన ఆకాశం, తేమ తగ్గడం, పశ్చిమ అవాంతరాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ముందస్తు వేసవి సంకేతమని IMD హెచ్చరిస్తోంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.