ELR: ఇటీవల గచ్చిబౌలిలో జలపవారిగూడెంకి చెందిన కొబ్బరి బొండాల లోడుతో రోడ్డు పక్కన టైర్ మార్చడం కోసం ఆగి ఉన్న 4 వ్యాన్లను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి రాచప్రోలు కన్నయ్య 13 రోజులు మృత్యువుతో పోరాడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.