AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. దాదాపు 55 అజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. విశాఖ, కాకినాడ, చీరాల, రాజమండ్రి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లోని పలు పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.