సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేటతో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వేసవి మొదలై ఎండలు ముదురుతున్న తరుణంలో ఈ అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.