ASR: చింతపల్లి జడ్పీ పాఠశాలలో టైప్-2 కస్తూర్భా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. గురువారం పాఠశాలలో కేజీబీవీ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. నిర్మాణాలు 80శాతం పూర్తయ్యాయని, జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.