MNCL: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు మొత్తం 9,735 మంది విద్యార్థులకు గాను 9,704 మంది హాజరు కాగా, 31 మంది గైర్హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 9,703 మందికి 9,680 మంది (23 మంది గైర్హాజరు), గతంలో తప్పిన వారు 32 మందికి 24 మంది (8 మంది గైర్హాజరు) హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.