NZB: బోధన్ మండలం కల్దుర్కిలో నాఫెడ్, స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. శనగ దిగుబడిని ఎకరాకు 7.5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచాలని, కౌలునామా విధానం ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గంగ శంకర్, ఏఎంసీ ఛైర్మన్ చీల శంకర్ పాల్గొన్నారు.