HYD: AIMIM ఆధ్వర్యంలో సోమవారం మలక్పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్ నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.