JN: రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు. పాలకుర్తి(M) గూడూరు గ్రామంలో రైతు సంఘం కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.