NZB: బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మాధవనగర్ ఆర్వోబీ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నగరంలోని సుభాష్నగర్కు చెందిన అనురాగ్ (18) సోమవారం అర్ధరాత్రి మాధవనగర్ వద్ద బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చగా మంగళవారం చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.