SDPT: కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.