BPT: కొరిశపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఎలిజిబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగాగ ఆమె పోషణ్ పక్వాడ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గురించి బాలింతలు, గర్భిణీ స్త్రీలకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని రాణి చెప్పారు.