KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ఇవాళ బసాపురం ఎస్.ఎస్. ట్యాంకును పరిశీలించారు. ట్యాంకులో ఉన్న నీటి నిల్వలు పట్టణానికి మూడు నెలలు సరిపోతాయని తెలిపారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కెనాల్ నీరు కొత్తగా వచ్చినందున ప్రజలు నీటిని మరిగించి తాగాలని విజ్ఞప్తి చేశారు.