NZB: రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో పూల్ విన్నర్గా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ల్లో నిజామాబాద్ క్రీడాకారిణులు వరుస విజయాలు సాధించారు. హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జట్లను మట్టికరిపించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.