హోలీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మెదక్ జిల్లాలో వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ‘డ్రై డే’గా ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.