SRPT: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీవోఈ, రెగ్యులర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తుంగతుర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.