HYD: కోకాపేటలోని శారదా పీఠం భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి చేసిన కేటాయింపులను రద్దు చేస్తూ, ఆ భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. నిర్మాణాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మంత్రి శ్రీధర్ బాబును కలవాలని పీఠం ప్రతినిధులకు సూచిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.