కృష్ణా: మొవ్వ మండలం అవురుపూడి గ్రామంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘వేసవిలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం మన బాధ్యత. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.