NTR: ఏ. కొండూరు(M) కేజీ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ అసోసియేషన్ సభ్యుడు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లి-శిశు ఆరోగ్యం, పిల్లల మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ నుంచే సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు.