ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను చైర్పర్సన్ బల్లా పల్లవి సమీక్షించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలోనే అన్ని సౌకర్యాలతో దీనిని రైతులకు, వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు.