AKP: పరవాడ మండలం తాడి సమీపంలో రాంకీ యాజమాన్యం రసాయనిక వ్యర్థాలను నిల్వ చేయడానికి తవ్వుతున్న చెరువును వెంటనే మూసివేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం లంకెలపాలెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. భూగర్భ జలాలు ఇప్పటికే కాలుష్యం అయినట్లు పేర్కొన్నారు. చెరువుకు అనుమతిస్తే కాలుష్యం మరింత పెరుగుతుందన్నారు.