HNK: ఎల్కతుర్తి మండలం సూరారం, దండేపల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన్ను వారు కోరారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చిరంజీవి, నేతలు మధుకర్, మధు, సంపత్ రావు తదితరులు ఉన్నారు.