NRML: నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 244 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరశురాం తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు 6876 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6627 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.