SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు పురోహితులు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.