MNCL: తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా గోగర్ల రాజేశం నియామకం అయ్యారు. బెల్లంపల్లి మండలం కన్నాలకు చెందిన రాజేశంకు శుక్రవారం TUV రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ హామీలను ఉద్యమాకారులకు అమలు చేసేంత వరకు పోరాడాలన్నారు.