KRNL: ఆదోనిలో తుంగభద్ర కాలువ నుంచి మూడు రోజుల్లో నీరు రానున్న నేపథ్యంలో ఇవాళ బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ను గుడిసె ఆది కృష్ణమ్మ పరిశీలించారు. ఎండాకాలంలో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ట్యాంక్ మరమ్మత్తులు, నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో ప్రజల అవసరాలు తీర్చాలని పేర్కొన్నారు.