NLG:టెస్కో ద్వారానే యూనిఫాం ఆర్డర్లు ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేనేత సంఘాల బాధ్యులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలకు టెండర్లు ఇవ్వడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.