MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి శివారులోని శ్రీ రాజ్ అల్యూమినియం కంపెనీలో చోరీ జరిగినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 4న రాత్రి గుర్తు తెలియని దొంగలు గోడ దూకి, సెక్యూరిటీ గార్డ్ రమాకాంత్ శర్మ విధుల్లో ఉండగానే విలువైన అల్యూమినియం ఇంగోట్లను ఎత్తుకెళ్లారు. కంపెనీ సూపర్వైజర్ ఉమామహేశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.