W.G: మొగల్తూరు మండలం వారతిప్పలో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. నిషేధం అమలులో ఉన్నా నిర్వాహకులు బహిరంగంగానే స్థావరాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ జూదాన్ని అరికట్టాలని తెలిపారు.