SS: మడకశిరలోని బీసీ బాలికల వసతి గృహానికి సుంగ్వూ హైటెక్ సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ టీవీని శుక్రవారం విరాళంగా అందజేశారు. విద్యార్థినుల ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఈ స్మార్ట్ టీవీ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. డి. శ్రీనివాస్ మూర్తి, డా. కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.