PLD: వైసీపీ నినాదం మావిగన్ ఏపీ అభివృద్ధి మంత్రం కాబోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి రజిని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేస్తుందన్నారు. అయితే అమరావతి రాజధాని పూర్తి అవకాశం లేనేలేదని రాంబాబు ఘంటాపదంగా తెలిపారు.