కోనసీమ: అంబాజీపేటలోని ఓ కాలువలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతురాలు రజకపేటకు చెందిన నాగమ్మ (85)గా పోలీసులు గుర్తించారు. ముక్కామల-చినలంక మధ్య ఉన్న ప్రధాన పంటకాలువ లాకుల వద్ద ఆమె మృతదేహం లభ్యమైందని SI షేక్ సుభాని శుక్రవారం చెప్పారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని నాగమ్మ మార్చి 30న ఇంటి నుంచి వెళ్లిపోయింది అని తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిందన్నారు.