NLR: మార్కాపురం వద్ద ఇటీవల బస్సు టిప్పర్ను ఢీకొని దగ్ధమైన ఘటనలో 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం అధికారులు జిల్లాలోని ASపేటలో పలు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సీఐ గంగాధర్, ఎస్సై సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.