నెల్లూరు ఉమ్మారెడ్డి గుంటకు చెందిన వాణికి శుక్రవారం పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు బాధితురాలికి అంబులెన్స్లో వాహనంలో ప్రథమ చికిత్స అందించి మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.